మహేష్ గుణశేఖర్ సినిమాలో

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఈ మధ్యన దర్శకత్వం వహించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఇతనే దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘రాణి రుద్రమ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రదారిణిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టుకొట్టి మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకు భారీ సెట్లు వేయడమే కాకుండా అదనపు హంగులు అద్దుతున్నాడు. ఇప్పటికే అనుష్క, రాణా, క్రిష్ణంరాజు, బాబా సెహగల్, నథాలియా కౌర్ లాంటి ప్రముఖులను ఇందులో చేర్చాడు. తాజాగా ఇందులో ఓ తెలుగు స్టార్ హీరోను పెట్టాలను భావిస్తున్నాడట. కథలో భాగంగా ఓ యువరాజు పాత్ర ఉంటుందట. పది నిమిషాల నివిడి ఉండే ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో మహేస్ బాబును తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇఫ్పటికే మహేస్ బాబు అతనితో సినిమాలు తీశాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొనే గుణశేఖర్ మహేష్ ని సంప్రదించాడట. కానీ ప్రస్తుతం ‘1’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న మహేస్ దీని పై ఎలాంటి నిర్ణయం చెప్పలేదట. ఒకవేళ మహేష్ బాబు ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు.