ప‌వ‌న్‌ని దాటేసిన మ‌హేష్‌!

ఉత్త‌రాఖండ్ ప్ర‌ళ‌యం... అంద‌రినీ క‌దిల్చివేసింది. మ‌న‌సున్న‌వారెవరైనా ఆ విప‌త్తు గురించి వింటే... త‌ల్ల‌డిల్లిపోతున్నారు. అయ్యో అన్న‌వాళ్లు కొంద‌రైతే, ఆప‌న్న‌హ‌స్తం అందించడానికి ముందుకొచ్చిన‌వారు మ‌రికొంద‌రు. చిత్ర‌సీమ నుంచి.. ఆర్థిక స‌హాయం అందించ‌డంలో తొలి అడుగు ప‌వ‌న్ క‌ల్యాణ్ వేశాడు. రూ.20 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించాడు. అన్ని విష‌యాల్లోనూ ప‌వ‌న్‌తో స‌మ ఉజ్జీగా నిలిచిన మ‌హేష్‌బాబు ఆర్థిక స‌హాయం విష‌యంలో మాత్రం ప‌వ‌న్‌ని దాటేశాడు.


ఉత్త‌రాఖండ్ బాధితుల స‌హాయార్థం మ‌హేష్ బాబు రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందించాడ‌ట‌. ఇందుకు సంబంధించిన చెక్కుని ప్ర‌భుత్వానికి అందించిన‌ట్టు సమాచార‌మ్‌. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు 1-నేనొక్క‌డినే షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. విప‌త్తు గురించి తెలుసుకొని... వెంట‌నే త‌న వంతుగా స‌హాయం అందించ‌డానికి ముందుకొచ్చిన‌ట్టు తెలిసింది.

 
ఇదొక్క‌టే కాదు, పేద ప్ర‌జ‌ల‌కు వైద్య‌స‌హ‌కారం అందించ‌డానికి మ‌హేష్ త్వ‌ర‌లోనే ఓ భారీ ప్రాజెక్టు చేప‌ట్ట‌బోతున్నాడు. కేన్స‌ర్‌లాంటి మ‌హ‌మ్మారి బారీన ప‌డిన పేద ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ వ‌ర్క్ జ‌రుగుతోంది.