చెర్రీ ఆడియోకి ఎవరు రావట్లేదా....?

మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' ఆడియో వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాదారణంగా అభిమానులు ఎదురు చూడాలి కానీ. ఈ సారి ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తున్నారు. 

కారణం ఏమిటంటే ....ఇప్పుడు జరిగే ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా ఎవరు వస్తారని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ వరదల వలన చిరు అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వేడుకకు వస్తే ఇంకా రచ్చ అవుతుంది. 

ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లు వారివారి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. దాంతో రామ్ చరణ్ ఎవడు సినిమాకి ఆడియో వేడుకకి చీఫ్ గెస్ట్ గా ఎవరు రారేమో అని అనిపిస్తుంది.